బాలీవుడ్ వెటరన్ హీరో ధర్మేంద్ర కూతురు, బాలాజీ టెలీ ఫిల్మ్స్, ఆల్ట్ బాలాజీ ఓటీటీ అధినేత ఏక్తా కపూర్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేస్ ఫైల్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆల్ట్ బాలాజీ ఓటీటీలో ఏక్తాకపూర్ నిర్మించే వెబ్ సిరీస్లు చాలా వరకు అడల్ట్ కంటెంట్కి సంబంధించినవే కావడం ఇక్కడ గమనార్హం.
ఏక్తాకపూర్ తాజాగా నిర్మించిన వెబ్ సిరీస్ `అన్ సెన్సార్డ్ సీజన్ 2`. ఇందులోని ఓ ఎపిసోడ్లో ఆర్మీ దుస్తుల్లో కనిపించే ఓ వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడే సన్నివేశాలున్నాయట. దీనికి సంబంధించిన ట్రైలర్ని ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్లో ఆర్మీ ఆఫీసర్ భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్టుగా అసభ్యంగా చూపించారని ఆరోపిస్తూ హైదరాబాద్కు చెందిన విశాల్కుమార్ ఆల్ట్ బాలాజీ ఓటీటీ అధినేత ఏక్తా కపూర్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆర్మీ ఆఫీసర్లని కించపరుస్తూ వెబ్ సిరీస్లో చూపించిన ఏక్తా కపూర్పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విశాల్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు సేకరించిన తరువాత సైబర్ క్రైమ్ పోలీసులు ఏక్తా కపూర్కు నోటీసులు పంపిస్తామని వెల్లడించారు.