ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ని హీరోగా పరిచయం చేస్తూ సుజి విజువల్స్ బ్యానర్పై విజువల్స్ బ్యానర్పై నిర్మాత కె. వెంకటరమణ నిర్మిస్తున్న చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. `హిప్పీ` ఫేమ్ దిగాంగన సూర్యవన్షీ హీరోయిన్గా నటిస్తోంది. మురళీరాజ్ తియ్యాన దర్శకత్వం వహిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి. వి.వినాయక్ క్లాప్ నిచ్చారు.
జానీ మాస్టర్ మాట్లాడుతూ ` నాకు కొరియోగ్రాఫీ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం శివకార్తీకేయన్ చిత్రానికి కొరియోగ్రఫీ చేస్తున్నాను. ఈ సినిమా అంగీకరించడానికి కారణం చెప్పలేను. నాకు కొరియోగ్రఫీ, డైరెక్షన్ అంటే ఇష్టం. దర్శకుడికి అదే చెప్పాను. యాక్టింగ్ అంతగా ఇష్టం వుండదని చెప్పాను. కానీ దర్శకుడు చెప్పిన కథ విన్న తరువాత ఈ మూవీ చేయాలని నిర్ణయించుకున్నాను. నీవు లేకపోతే ఈ సినిమా చేయనని నిర్మాత చెప్పడంతో మరింత కనెక్ట్ అయ్యాను. నా పపక్కన నటించడానికి అంగీకరించిన దిగాంగనకు థ్యాంక్స్` అన్నారు.
నిర్మాత కె. వెంకటరమణ మాట్లాడుతూ ` జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే మాకు చాలా ఇష్టం. ఆయనతో ఎప్పటికైనా సినిమా చేయాలనుకున్నాను. అది ఇప్పటికి కుదిరింది. కథని నమ్మి ఆయన దగ్గరికి వెళ్లాం. దర్శకుడు మురళి చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పాను. మంచి టీమ్ కుదిరింది` అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రథన్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : పీవీరాజు, మాటలు: యశోదా గౌరీశంకర్.