HomeUncategorizedఅలవాటులో పొరబాటు.. టైటిల్ రివీల్ చేసేసిన చిరు

అలవాటులో పొరబాటు.. టైటిల్ రివీల్ చేసేసిన చిరు

అలవాటులో పొరబాటు.. టైటిల్ రివీల్ చేసేసిన చిరు
అలవాటులో పొరబాటు.. టైటిల్ రివీల్ చేసేసిన చిరు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152వ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. సైరా నరసింహారెడ్డి చిత్రంతో అందరి ప్రశంసలు దక్కించుకున్నా కానీ కమర్షియల్ గా ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం షూట్ శరవేగంగా సాగుతోంది. స్ట్రైక్ కు సంబంధించిన సీన్స్ కు చిత్రీకరించిన బృందం ఇప్పుడు ఫైట్స్ షూట్ లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే నిన్న ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి అనుకోకుండా తన సినిమా టైటిల్ ను రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఓ పిట్ట కథ సినిమా గురించి మాట్లాడుతూ మధ్యలో తన సినిమా టాపిక్ రావడంతో “నా తదుపరి చిత్రం ఆచార్యలో కూడా.. ” అని మధ్యలో ఆగిపోయి టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు కదా చెప్పేసానా అని తన ప్రసంగాన్ని కంటిన్యూ చేసాడు. దీంతో ఇన్నాళ్లూ ప్రచారంలో ఉన్న ఆచార్య టైటిల్ నిజమేనని తేలిపోయింది. అసలు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆచార్య అనే టైటిల్ రిజిస్టర్ అయినప్పుడే సగం ఇదే టైటిల్ అని ఫిక్స్ అయ్యారు. ఇక ఇప్పుడు టోటల్ గా కన్ఫర్మ్ అయింది. మరి అధికారికంగా ఈ విషయాన్ని చిత్ర బృందం ఎప్పుడు చెబుతారో చూడాలి.

- Advertisement -

ఇదిలా ఉంటే ఆచార్య లో మహేష్ బాబు కీలక పాత్ర పోషించనున్నాడని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ విషయంపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఆచార్యకు మణిశర్మ స్వరాలు అందిస్తున్న విషయం తెల్సిందే. సోను సూద్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ను జూన్ కల్లా ఫినిష్ చేసి ఆగస్ట్ లో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All