`తాత – మనవడు` చిత్రంతో దర్శకరత్న డా. దాసరి నారాయణరావు సినీ ప్రస్థారం మొదలైంది. శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దాసరి 140 చిత్రాల వరకు తెరకెక్కిచారు. దర్శకుడు అన్న పదానికి వన్నె తెచ్చారు. డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని బలంగా వాదించి దర్శకుడికి గౌరవాన్ని తీసుకొచ్చారు దాసరి. ఆయన 77వ జయంతి నేడు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ఇటీవల ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ గత కొన్ని రోజులుగా యాక్టీవ్గా ట్వీట్లు పెడుతున్నారు. తాజాగా దాసరి 77వ జయంతి సందర్భంగా ఆయనని గుర్తు చేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టడమే కాకుండా దాసరితో కలిసి దిగిన ఓ ఫొటోని షేర్ చేశారు.
దా.. దానంలో కర్ణుడు మీరు
స… సమర్ధతలో అర్జునుడు మీరు
రి.. రిపు వర్గమేలేని ధర్మరాజు మీరు
మీరు మా మాధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎఉప్పుడూ సజీవంగానే వుంటుంది. ప్రతి భావిదర్శకుడి జీవితానికి మర్గకమవుతుంది` అంటూ ఓ ఫొటోని షేర్ చేశారు చిరంజీవి.
దా..దానంలో కర్ణుడుమీరు
స..సమర్ధతలో అర్జునుడుమీరు
రి..రిపువర్గమేలేని ధర్మరాజుమీరు
మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది.
ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది.
This was my last memory of Guruvu garu.We miss u Sir #LastPressmeet #Dasari pic.twitter.com/XBOUmIqLyW
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2020