Homeటాప్ స్టోరీస్వేదాళం` రీమేక్‌కు చిరు అంత తీసుకుంటున్నారా?

వేదాళం` రీమేక్‌కు చిరు అంత తీసుకుంటున్నారా?

 chiranjeevi demanding huge amount for vedhalam remake
chiranjeevi demanding huge amount for vedhalam remake

మెగాస్టార్ చిరంజీవి గ‌త ఏడాది న‌టించిన పిరియాడిక్ ఫిల్మ్ `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి భారీ స్థాయిలో ఖ‌ర్చు చేశారు. న‌య‌న‌తార‌, బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, త‌మ‌న్నా ఇందులో కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో మాత్రం వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. కొంత మేర న‌ష్టాల‌ని తెచ్చిపెట్టింది.

దీంతో ఈ మూవీ న‌ష్టాల‌ని భ‌ర్తీ చేసే ప‌నిలో ప‌డ్డారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగా బ‌య‌టి నిర్మాత‌ల‌కు సినిమాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం నిరంజ‌న్‌రెడ్డి నిర్మిస్తున్న`ఆచార్య‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. చిరు ఈ నెల 20 నుంచి సెట్‌లోకి ఎంట‌ర్ కాబోతున్నారు. ఈ చిత్రానికి గాను చిరు 50 కోట్లు చార్జ్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇక్క‌డ షాకింగ్ విష‌యం ఏంటంటే `వేదాళం` రీమేక్ కోసం 60 కోట్లు డిమాండ్ చేసిన‌ట్టు ఇండ‌స్ట్రీ టాక్‌. త‌మిళ హిట్ ఫిల్మ్ `వేదాళం`ని చిరుతో మెహ‌ర్ ర‌మేష్ రీమేక్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనిల్ సుంక‌ర నిర్మించ‌బోతున్నారు. అత్యంత త‌క్కువ బ‌డ్జెట్ లో ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారు. పారితోషికంతో పాటు ఈ మూవీ లాభాల్లోనూ చిరుకు వాటా ఇవ్వ‌నున్నార‌ట‌. దాంతో క‌లిపి చిరు పారితోషికం 60 కోట్లు అవుతుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All