Homeటాప్ స్టోరీస్మెగాస్టార్ మళ్ళీ ట్వీట్ చేసాడుగా

మెగాస్టార్ మళ్ళీ ట్వీట్ చేసాడుగా

మెగాస్టార్ మళ్ళీ ట్వీట్ చేసాడుగా
మెగాస్టార్ మళ్ళీ ట్వీట్ చేసాడుగా

మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ సమయంలో ట్విట్టర్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. చిరు గ్రాండ్ ఎంట్రీ అదిరిపోయింది. రావడం రావడమే తనదైన చమత్కారంతో అందరినీ అలరించాడు మెగాస్టార్. చిరంజీవి చాలా ఉత్సహాంగా చేసిన ఆయన అభిమానులకు కూడా తెగ నచ్చేసింది. లాక్ డౌన్ సమయం కావడంతో అటు చిరుకి మంచి టైం పాస్ అయ్యేది, ఇటు అభిమానులకు కూడా టచ్ లో ఉన్న ఫీల్ ఉండేది. దాదాపు నాలుగు నెలల్లోనే 100కు పైగా ట్వీట్స్ వేసి చాలా ఉత్సాహం చూపించాడు మెగాస్టార్. అయితే ఉన్నట్లుండి ట్విట్టర్ లో సైలెంట్ అయ్యాడు.

జూన్ మొదటి నుండే ట్వీట్ల హడావిడి తగ్గించేసిన మెగాస్టార్, జూన్ 21న ఫాథర్స్ డేస్ సందర్భంగా చేసినదే లాస్ట్ ట్వీట్. దాని తర్వాత అతని నుండి ఒక్క ట్వీట్ కూడా రాలేదు. మెగాస్టార్ ఇలా సడెన్ గా ఎందుకు సైలెంట్ అయ్యారో ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ నిన్న చిరు నుండి ట్వీట్స్ వచ్చాయి.

- Advertisement -

ఒక స్ఫూర్తి కలిగించే వ్యక్తి గురించి చేసిన ట్వీట్ పై చిరు స్పందించాడు. కేరళకు చెందిన శివన్ అనే వ్యక్తి పోస్ట్ మ్యాన్ గా ఇటీవలే రిటైర్ అయ్యారు. ఆయన తన సర్వీస్ లో ప్రతిరోజూ దాదాపు 15 కిలోమీటర్లు అడవిలో క్రూర మృగాల భయాన్ని తప్పించుకుని తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాడని చేసిన ట్వీట్ పై చిరు స్పందించి అభినందించాడు.

తర్వాత కొద్ది గంటలకు అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన త్వరగా రికవర్ అవ్వాలని ప్రార్ధిస్తూ ట్వీట్ చేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All