`Rx 100` సెన్సేషనల్ హిట్తో క్రేజీ హీరోగా పాపులరిటీని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో కార్తీకేయ గుమ్మకొండ. అయితే ఆ సినిమా తరురవాత కార్తికేయకు ఆ స్థాయి హిట్ లభించడం లేదు. అందు కోసం ఏకంగా గీతా ఆర్ట్స్ క్యాపస్లో ఓ కొత్త తరహా సినిమా చేస్తున్నాడు. `చావు కబురు చల్లగా` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఇందులో కార్తికేయకు జోడీగా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ని రిలజ్ చేశారు. ఇందులో కార్తికేయ స్మశానానికి శవాలని తీసుకెళ్లే వాహనాన్ని నడిపే బస్తీ బాలరాజుగా మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ కు విశేష స్పందన రావడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.
ఈ నెల 21న హీరో కార్తికేయ పుట్టినరోజు కావడంతో ఆ రోజు సర్ప్రైజ్ ఇవవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. 21న సోమవారం ఉదయం 11: 47 నిమిషాలకు ఈ మూవీ నుంచి వరల్డ్ ఆఫ్ బస్తీ బాలరాజు పేరుతో స్పెషల్ వీడియోని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి సంంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ మొత్తం పూర్తయింది. త్వరలో బ్యాలెన్స్గా వున్న షూటింగ్ని స్టార్ట్ చేయబోతున్నారు. జెట్ స్పీడుతో షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.