విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న చిత్రం ఎఫ్3. బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఎఫ్2 చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. తమన్నా, మెహ్రీన్ లు ఈ సినిమాలో కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కు కరోనా కారణంగా బ్రేకులు పడుతూ వస్తున్నాయి. మైసూర్ లో కొన్ని వారాల క్రితం షూటింగ్ మొదలైనా కానీ కరోనా నేపథ్యంలో ముందుకు సాగలేదు.
ఇప్పుడు వరుణ్ తేజ్ మొదటగా గని చిత్రాన్ని పూర్తి చేయాలనుకున్నాడు. మరోవైపు వెంకటేష్ కు బ్రేక్ కోరడంతో ఎఫ్3 తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ 1 నుండి మొదలుకాబోతోంది. సెకండ్ హాఫ్ మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తారట.
ఈసారి మైసూర్ లో కాకుండా హైదరాబాద్ లోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో షూటింగ్ జరగనుంది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లతో పాటు కీలకమైన కాస్ట్ అంతా ఈ షెడ్యూల్ లో భాగం పంచుకోనున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫన్ ఎంటర్టైనర్ ను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.