మెగా కాంపౌండ్లో సక్సెస్కి కెరాఫ్ అడ్రస్గా నిలిచిన వ్యక్తి బన్నీవాసు. సాయిధరమ్తేజ్కి `ప్రతి రోజు పండగే` వంటి హిట్ చిత్రాన్ని అందించిన బన్నీవాసు తాజాగా అల్లు అర్జున్కు `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ని అందించడంతో ప్రధాన పాత్ర పోషించారు. తెర ముందు అల్లు అరవింద్ నిర్మాత అయిన తెర వెనుక మాత్రం పబ్లిసిటీ దగ్గరి నుంచి ప్రతీ ఒక్కటీ బన్నీవాసు ద్వారానే జరిగాయి. అతని సక్సెస్ గురించి తెలుసుకున్న చిరంజీవి తన అల్లుడు కల్యాణ్దేవ్ని అతనికి అప్పగించినట్టు తెలిసింది.
కల్యాణ్దేవ్ `విజేత` సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో ఎవ్వరికి తెలియదు. అంతగా ప్రేక్షకుల్ని రీచ్ కాలేకపోయింది. ఆ తరువాత `సూపరఖ మచ్చి` పేరుతో ఓ సినిమా చేస్తున్న కల్యాణ్దేవ్ తాజా చిత్రాన్ని బన్నీవాసుకి అప్పగించినట్టు తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగాఅభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల నిర్మించనున్న ఈ చిత్రానికి బన్నీ వాసు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
అహా నా పెళ్లంట, పూల రంగడు, లౌక్యం వంటి హిట్ చిత్రాలకు కథ. మాటలు అందించిన శ్రీధర్ సీపాన ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. త్వరలోనే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని చిత్ర బృందం వెల్లడించనుందని తెలిసింది.