Homeటాప్ స్టోరీస్బ్ర‌హ్మాజీకి కోపం ఎందుకొచ్చింది?

బ్ర‌హ్మాజీకి కోపం ఎందుకొచ్చింది?

బ్ర‌హ్మాజీకి కోపం ఎందుకొచ్చింది?
బ్ర‌హ్మాజీకి కోపం ఎందుకొచ్చింది?

నుటుడు బ్ర‌హ్మాజీకి కోప‌మొచ్చింది. ఎవ‌రి మీద ఎందుకు అని ఆరాతీస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఇటీవ‌ల విడుద‌లైన హిట్ చిత్రాల్లో బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన విష‌యం తెలిసిందే. మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు`, స్టైలి స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాల్లో న‌టించారు. ఇటీవ‌ల విడుద‌లై `భీష్మ‌`, హిట్‌, ఓ పిట్ట‌క‌థ వంటి చిత్రాల్లోనూ న‌టించారు.

తాజాగా ప‌లు భారీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. అయితే ఆయ‌న హీరోయిన్స్‌పై మండిప‌డుతున్నారు. క‌రోనా కార‌ణంగా కేంద్ర ప్ర‌భుత్వం దేశం మొత్తం లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. దీంతో అంతా ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. అయితే ఈ లాక్ డౌన్ కార‌ణంగా చాలా మంది రోజు వారీ ప‌నివారు మాత్రం దుర్భ‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

సినీ రంగంలో మాత్రం షూటింగ్‌లు ఆగ‌పోవ‌డంతో  డైలీ వ‌ర్క‌ర్స్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతో వారిని ఆదుకోవ‌డం కోసం మెగాస్టార్ చిరంజీవి అధ్య‌క్ష‌త‌న సీసీసీ (క‌రోనా క్రైసిస్ చారిటి)ని ఏర్పాటు చేసి సినీ కార్మికుల కోసం విరాళాలు సేక‌రిస్తున్నారు. ఇప్ప‌టి వ‌రకు చిరు నుంచి సందీప్ కిష‌న్ వ‌రు భారీగానే స్పందించి విరాళాలు ప్ర‌క‌టించారు. హీరోయ‌న్ లావ‌ణ్య త్రిపాఠి కూడా స్పందించింది. కానీ మిగ‌తా హీరోయిన్‌లు మాత్రం స్పందించ‌డం లేద‌ని బ్ర‌హ్మాజీ మండిపడుతున్నారు.

ముంబైకి చెందిన చాలా మంది ఇక్క‌డ స్టార్ హీరోయిన్‌లుగా చెలామ‌ణి అవుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో మాత్రం వారి నుంచి ఎలాంటి స్పంద‌న క‌నిపించ‌డం లేదు. కార్మికుల కోసం విరాళాలు ఇవ్వ‌డం లేద‌ని బ్ర‌హ్మాజీ మండిప‌డుతుడ‌టం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All