హీరో ఎంత స్ట్రాంగ్గా వున్నా వినల్ స్ట్రాంగ్గా వుంటేనే మజా వుంటుంది. ఆ కాంబినేషన్ రసవత్తరంగా వుంటుంది. విలన్ ఎంత స్ట్రాంగ్గా వుంటే హీరోయిజం అంత స్ట్రాంగ్గా వుంటుంది. ఇదే బోయపాటి ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం `లెజెండ్` మూవీ కోసం జగపతిబాబుని విలన్గా పరిచయం చేశాడు. ఆ తరువాత బన్నీతో చేసిన `సరైనోడు` చిత్రంతో ఆది పినిశెట్టిని వైరమ్ ధనుష్ అంటూ పరిచయం చేసి బన్నీ క్యారెక్టర్ని ఓ రేంజ్లో ఎలివేట్ చేయడంతో ఊరమాస్ ఎంటర్టైనర్గా రూపొందించిన `సరైనోడు` సూపర్హిట్గా మలిచాడు.
అదే సక్సెస్ ఫార్ములాని బాలకృష్ణతో చేస్తున్న చిత్రానికి అప్లై చేయాలనుకుంటున్నాడట. బోయపాటి – యబాలయ్య కాంబినేషన్లో ప్రస్తుతం మూడవ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం బాలయ్య క్యారెక్టర్కు తగ్గ స్ట్రాంగ్ విలన్ కోసం బోయపాటి ప్రయత్నిస్తున్నారట. ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యాడ్మెన్ సంజయ్దత్ని విలన్గా అనుకున్నారట. అతనికి థ్రోట్ క్యాన్సర్ అని తేలడంతో ఆ ప్రయత్నాలని విరమించుకున్నారు.
తాజాగా సోనుసూద్ పేరు తెరపైకి వచ్చినా అది కూడా వర్కవుట్ అయినట్టుగా కనిపించడం లేదు. దీంతో `వినయ విధేయ రామ`లో విలన్గా నటించిన వివేక్ ఓబెరాయ్నే మళ్లీ నమ్ముకోవాలనుకుంటున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటనతో పాటు హీరోయిన్ని కూడా ప్రకటించాలని బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.