ప్రముఖ బాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ సరోజ్ఖాన్ (71) ఇక లేరు. శ్వాస కోస సంబంధిత సమస్యతో శనివారం ముంబైలోని గురునానక్ ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ ఈ శుక్రవారం ఉదయం వేకువ జామున తుది శ్వాస విడిచారు. ఉదయం 2 గంటల సమయంలో ఆమెకు గుండె పోటు రావడంతో కన్నుమూశారు. 1950లో బాలనటిగా బాలీవుడ్లో అడుగుపెట్టిన సరోజ్ఖాన్ ఆ తరువాత ప్రముఖ కొరియోగ్రాఫర్గా పేరు ప్రఖ్యాతులు పొందారు.
తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో రెండు వేలకు పైగా పాటలకు నృత్యరీతులు సమకూర్చారు. మదర్ ఆఫ్ డ్యాన్స్గా భారతీయ సినీ రంగంలో చరగని ముద్ర వేసుకున్నారు. 1974లో `గీతా మేరా నామ్` చిత్రంతో సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆమె `మిస్టర్ ఇండియా, నగీనా, చాందినీ వంటి చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీదీక్షిత్కు పేరుతెచ్చిపెట్టిన `తేజాబ్` చిత్రంలోని `ఏక్ దో తీన్.. పాటకు సరోజ్ ఖానే కొరియోగ్రాఫర్. షారుఖ్ నటించిన `దేవదాస్` చిత్రంలోని `డోలా రే డోలా..` పాటకు కూడా డ్యాన్స్ కంపోజ్ చేసింది సరోజ్ కానే.
పలు జాతీయ పురస్కారాలతో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన `చూడాలని వుంది` చిత్రంలోని `ఓ మారి ఓ మారియా..` పాటకు గానూ 1998లో సరోజ్ఖాన్ నంది పురస్కరాన్ని దక్కించుకున్నారు. మహారాష్ట్రలో కరోనా స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయమే సరోజ్ఖాన్ అంత్య క్రియలు పూర్తి చేశారు.