స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ `పుష్ప`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. కన్నడ సోయగం రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభిస్తోంది.
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఊర మాస్ అంశాలతో సుకుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. `రంగస్థలం` ఫార్ములాతో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్గా ఊర మాస్ పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ నుంచి త్వరలోనే సర్ప్రైజింగ్ అప్డేట్ రాబోతోంది. ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `పుష్ప` నుంచి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట.
ఇందుకు సంబంధించి ఇప్పటికే దర్శకుడు సుకుమార్ వర్క్ మొదలుపెట్టారని తెలిసింది. `పుష్ప` నుంచి ఈ సారి బన్నీ బర్త్డేకి మైత్రీ మూవీ మేకర్స్ ఎలాంటి అప్ డేట్ని ఇవ్వబోతున్నారు? ఆ అప్ డేట్ ఎలా వుండబోతోందన్నది మాత్రం ఇప్పటి రకైతే సస్పెన్స్ అని తెలిసింది. ఊర మాస్ అంశాల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 13న ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.