త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో మరో భారీ చిత్రం తెరపైకి రానున్న విషయం తెలిసిందే. `అరవింద సమేత వీర రాఘవ` వంటి ఫ్యాక్షన్ మూవీ తరువాత మరోసారి వీరిద్దరూ కలిసి ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. నందమూరి కల్యాణ్ రామ్, ఎస్. రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు.
సమకాలీన రాజకీయాలపై మాటల మాంత్రికుడి వ్యంగ్యాస్త్రంగా ఈ సినిమా వుంటుందని ముందు ప్రచారం జరిగింది. అయితే రెగ్యులర్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా వుంటుందని తెలిసింది. కరోనా వైరస్, `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ కారణంగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఎప్పుడొస్తుందని మేకర్స్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
నిర్మాత ఎస్. రాధాకృష్ణ బర్త్డే ఈ రోజు. ఈ సందర్భంగా అయితే ఈ మూవీ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు అయితే దీనికి భిన్నంగా మరో నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పారు. `ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వమని ఫ్యాన్స్ నుంచి ఇప్పటికే చాలా మెసేజ్లు వస్తున్నాయి. షూటింగ్ మొదలుపెట్టిన వెంటనే దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తాం. టైటిల్ని ప్రకటించడం మాకు ఓ సెంటిమెంట్. అందుకే టైటిల్ని ప్రకటించలేకపోతున్నాం. మాపై నమ్మకం వుంచండి. మీకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం` అని ట్వీట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ శాంతించి గుడ్ న్యూస్ చెప్పారని అభినందించారు.