Homeటాప్ స్టోరీస్సీసీసీకి ఇద్ద‌రు నిర్మాత‌ల భారీ విరాళం

సీసీసీకి ఇద్ద‌రు నిర్మాత‌ల భారీ విరాళం

సీసీసీకి ఇద్ద‌రు నిర్మాత‌ల భారీ విరాళం
సీసీసీకి ఇద్ద‌రు నిర్మాత‌ల భారీ విరాళం

మెగాస్టార్ చిరంజీవి చైర్మ‌న్‌గా క‌రోనా క్రైసిస్ చారిటీ మ‌న కోసం (సీసీసీ) కు ప్ర‌ముఖ నిర్మాత‌లు మెగా సూప‌ర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్‌.బి. చౌద‌రి, మ‌రియు ఎన్‌.వి.ప్ర‌సాద్ 5 ల‌క్ష‌లు విరాళం అందించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ లో వ‌న్ ఆఫ్ ది ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన నిర్మాత మోహ‌న్ చెరుకూరి కూడా త‌న వంతు బాధ్య‌త‌గా సీసీసీకి 5 ల‌క్ష‌లు విరాళం అందించారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాత మోహ‌న్ చెరుకూరి మాట్లాడుతూ `షూటింగ్‌లు లేక ఉపాధి క‌రువై ఇబ్బందులు ప‌డుతున్న సినీ కార్మికుల‌ను సీసీసీ ఆదుకుంటున్న తీరు అభినంద‌నీయ‌మ‌ని, అందులో తానూ భాగం కావాల‌నే ఉత్తేశ్యంతో త‌న వంతు బాధ్య‌త‌ల‌గా ఈ విరాళం అందిస్తున్నాన‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.
క‌రోనా ఉధృతిని అరికట్ట‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని, వైద్య సిబ్బంది, పోలీసులు అద్భుతంగా త‌మ విధులను అహ‌ర్నిశ‌లు నిర్వ‌ర్తిస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శంసించారు.

- Advertisement -

ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మ‌న ప‌రిస‌రాల‌ను శుభ్రంగా ఉంచ‌డానికి పారిశుధ్య కార్మికులు నిరంత‌రం శ్ర‌మించ‌డం గొప్ప విష‌య‌మ‌ని ఈ సంద‌ర్భంగా నిర్మాత చెరుకూరి మోహ‌న్ అభిప్రాయ ప‌డ్డారు.  ప్ర‌భుత్వ యంత్రాంగాలు చేస్తున్న కృషికి త‌గ్గ‌ట్లు పౌరులుగా మ‌నంద‌రం మ‌న ఇంటికే ప‌రిమితం కావాల‌ని, క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో మ‌న వంతు పాత్రని పోషించాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All