ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి(50) మరణించారు. సోమవారం ఉదయం గుండెపోటుకు గురికావడంతో హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు అత్యవసరంగా వైద్యం అందించారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మంత్రి మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
మాజీ ఎంపీ రాజమోహన్రెడ్డి కుమారుడు గౌతమ్రెడ్డి. 1971 నవంబర్2న జన్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వారం రోజులపాటు దుబాయ్లో పర్యటించిన మేకపాటి ఆదివారమే హైదరాబాద్కు తిరిగొచ్చారు.
మంత్రి గౌతమ్ రెడ్డి మరణంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠార్మణం తీవ్రంగా కలిచివేసిందన్నారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.