Homeన్యూస్"విలక్షణమైన రచయిత భగీరథ " స్వరూపానంద స్వామి .

“విలక్షణమైన రచయిత భగీరథ ” స్వరూపానంద స్వామి .

bhageeratha is a different writer swaroopananda swamyజర్నలిస్ట్ భగీరథలో ఓ విలక్షణమైన రచయిత వున్నాడని , ఆయన రచించిన భగీరథ పథం చదివితే అర్ధమవుతుందని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పారు .
జర్నలిస్ట్ భగీరథ రచించిన “భగీరథ పథం ” పుస్తకాన్ని స్వామి బుధవారం నాడు హైద్రాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ భగీరథ ఎంత మంచి జర్నలిస్టో , అంతకు మించిన రచయిత కూడా అని , ఆయన నుంచి మరిన్ని పుస్తకాలు రావాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నా అన్నారు .

శ్రీమతి జమున మాట్లాడుతూ , తన జీవితాన్ని “జమునాతీరం” పేరుతో రచించారని, ఆ పుస్తకం తనకి ఎంతో పేరు తెచ్చిపెట్టిందని చెప్పారు . భగీరథ పథం పుస్తకం చదివితే ప్రపంచం పట్ల ఆయనలో ఎంత అవగాహన ఉందొ తెలుస్తుందని , చాలా విషయాలను నిష్పక్ష పాతంగా రాచారని చెప్పారు . తనకి మహానటుడు ఎన్టీ రామారావు జాతీయ అవార్డు రావడానికి భగీరదే కారణమై జమున పేర్కొన్నారు .

- Advertisement -

నిర్మాత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ భగీరథ అంటే మా అందరికి ఎంతో ఇష్టమని , ఆయనలోని నిజాయితీ ఆయన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందని చెప్పారు . మరుగున పడ్డ వ్యక్తులు , ఘటనల గురించి భగీరథ మరిన్ని పుస్తకాలు రచించాలని చెప్పారు .

దర్శకుకు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ , భగీరథ అనగానే మనకు సినిమా జర్నలిస్ట్ కనిపిస్తాడని , అయితే భగీరథ పథం చదివితే ఒక గొప్ప క్రిటిక్ , ప్రపంచ విషయాలపై ఆయన సునిశిత ద్రుష్టి మనల్ని అబ్బుర పరుస్తుందని చెప్పారు .

నిర్మాత కె .అచ్చి రెడ్డి మాట్లాడుతూ భగీరథ పథం పుస్తకం భగీరథ గారి లోని కొత్త కోణాన్ని తెలియ జేస్తుందని , ఆయనలోని అవగాహన, స్పష్టత ఆయన్ని సరి కొత్తగా చూపించాయని అన్నారు .
రచయిత సాయినాథ్ మాట్లాడుతూ , జాతీయ ,అంతర్జాతీయ విషయాలపై భగీరథ గారికి వున్న అవగాహన చూసి ఆశర్యపోయాను, ప్రతి ఆర్టికల్ అద్భుతంగా ఉందని చెప్పారు. మనకు ఈ పుస్తకం ద్వారా సరికొత్త భగీరథ కనిపిస్తాడని అన్నారు .

రచయిత్రి పల్లవి మాట్లాడుతూ , భగీరథ గారు జీవితంలో చాలా కస్టాలు పడి పైకి వచ్చారని, అయితే ఆయన జీవితంతో ఎప్పుడూ రాజీపలేదని చెప్పారు . ఆయన ఎప్పటికైనా దక్షిణ భారత చరిత్ర రాయాలని పేర్కొన్నారు .
సభకు అధ్యక్షత వహించిన సీనియర్ జర్నలిస్ట్, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శి టి. ఉదయవర్లు మాట్లాడుతూ , భగీరథ , నేను ఇద్దరం కలసి పనిచేశాం, ఇద్దరి అభిప్రాయలు ఒకటి కావడంతో నాలుగు దశాబ్దాలుగా మా స్నేహం కొనసాగుతుంది . ఆయన జర్నలిస్టుగానే కాకుండా రచయితగా కూడా చాల మంచి పుస్తకాలు వెలువరించాడు . భగీరథ పథం అందరూ చదవతగ్గ పుస్తకము అన్నారు .

రచయిత భగీరథ మాట్లాడుతూ ,స్వరూపానందేంద్ర స్వామివారి చేతుల మీదుగా భగీరథ పథం ఆవిష్కరణ కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు . ఈ స్పూర్తితో మరిన్ని రచనలు చేస్తానని చెప్పారు . “విలక్షణమైన రచయిత భగీరథ ” స్వరూపానంద స్వామి .
ఆశర్యపోయాను, ప్రతి ఆర్టికల్ అద్భుతంగా ఉందని చెప్పారు. మనకు ఈ పుస్తకం ద్వారా సరికొత్త భగీరథ కనిపిస్తాడని అన్నారు .

రచయిత్రి పల్లవి మాట్లాడుతూ , భగీరథ గారు జీవితంలో చాలా కస్టాలు పడి పైకి వచ్చారని, అయితే ఆయన జీవితంతో ఎప్పుడూ రాజీపలేదని చెప్పారు . ఆయన ఎప్పటికైనా దక్షిణ భారత చరిత్ర రాయాలని పేర్కొన్నారు .
సభకు అధ్యక్షత వహించిన సీనియర్ జర్నలిస్ట్, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శి టి. ఉదయవర్లు మాట్లాడుతూ , భగీరథ , నేను ఇద్దరం కలసి పనిచేశాం, ఇద్దరి అభిప్రాయలు ఒకటి కావడంతో నాలుగు దశాబ్దాలుగా మా స్నేహం కొనసాగుతుంది . ఆయన జర్నలిస్టుగానే కాకుండా రచయితగా కూడా చాల మంచి పుస్తకాలు వెలువరించాడు . భగీరథ పథం అందరూ చదవతగ్గ పుస్తకము అన్నారు .
రచయిత భగీరథ మాట్లాడుతూ ,స్వరూపానందేంద్ర స్వామివారి చేతుల మీదుగా భగీరథ పథం ఆవిష్కరణ కావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు . ఈ స్పూర్తితో మరిన్ని రచనలు చేస్తానని చెప్పారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All