యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోయిన్ కం ప్రొడ్యూసర్ ఛార్మి పై చాలా కోపంగా ఉన్నాడట . ఎందుకంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు చిత్రాన్ని జూలై 18 న విడుదల చేస్తుండగా అదే రోజున రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని విడుదల చేస్తున్నామంటూ ప్రకటించారు దాంతో ఛార్మి పై ఆగ్రహంగా ఉన్నాడు బెల్లంకొండ .
అసలు ముందుగానే ఈ సినిమా విడుదల సందర్బంగా డేట్ ఫిక్స్ చేసుకోవడానికి మాట్లాడుకున్నారు . చర్చల సందర్బంగా జూలై 12న ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు దాంతో రాక్షసుడు చిత్రాన్ని జూలై 18 న అని డేట్ ఫిక్స్ చేసుకున్నారు కట్ చేస్తే ఇప్పుడు ఏకపక్షంగా జూలై 18 న ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అంటూ పోటీకి వస్తున్నారు దాంతో బెల్లంకొండ చాలా ఆగ్రహంగా ఉన్నాడట ఛార్మి మీద . పాపం బెల్లంకొండ కు కమర్షియల్ హిట్ దక్కలేదు దాంతో తమిళ సూపర్ హిట్ చిత్రం పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు .