రాక్షసుడు చిత్రంలో నేను ఓవర్ యాక్షన్ చేయలేదని , క్యారెక్టర్ కు ఎంత అవసరమో ….. అంతవరకూ మాత్రమే చేసానని అంటున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ . రమేష్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ నటించిన చిత్రం రాక్షసుడు ఆగస్టు 2 న భారీ ఎత్తున విడుదల కాబోతోంది దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీడియా ముందుకు వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో ఓవర్ యాక్టింగ్ చేయలేదని తేల్చి చెప్పాడు .
ఇక నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు . ఈ వేడుకకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అభిమానులు , నిర్మాత బెల్లంకొండ సురేష్ సన్నిహితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు . తమిళంలో సంచలన విజయం సాధించిన చిత్రం కావడంతో తెలుగులో కూడా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు .