దేశ వ్యాప్తంగా కరోనా దెబ్బతో కీలక వ్యస్థలన్నీ కుదేలై పోతున్నాయి. ఐటీ, సినిమా వంటివి ఇప్పటికే భారీ స్థాయిలో నష్టాలని చివిచూశాయి. సినిమా రంగం మరింతగా నష్టాల ఊబిలోకి వెళ్లిపోయింది. షూటింగ్ పూర్తి కానీ సినిమాలు చాలానే వున్నాయి. పూర్తయి రిలీజ్కు సిద్ధమైనవీ చాలానే వున్నాయి. రిలీజ్కి థియేటర్లు లేవు. దీంతో రిలీజ్లు వాయిదా పడ్డాయి. కొంత మంది ఆగలేక ఓటీటీలకు సినిమాల్ని అమ్మేస్తున్నారు.
కొంత మంది థియేటర్లు రీ ఓపెన్ అయ్యే వరకు వేచి చూడాలనే ధోరణితో సినిమాల్ని ఓటీటీలకు అమ్మడం లేదు. అలాంటి వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇక గడిచిన వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు ప్రమాద స్థాయిని తాకడంతో షూటింగ్లు చేయాలంటే స్టార్ హీరోలే భయపడుతున్న పరిస్థతి. ఈ నేపథ్యంలో ఓ యంగ్ హీరో మాత్రం తాను షూటింగ్ చేయడానికి రెడీ అంటున్నారు. అతనే బెల్లంకొండ శ్రీనివాస్.
ఆయన నటిస్తున్న తాజా చిత్రం `అల్లుడు అదుర్స్`. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కొత్త నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం అంతా సవ్యంగా వుంటే చిత్రీకరణ పూర్తయి ఏప్రిల్ లేదా మేలో రిలీజ్ కావాల్సింది. లాక్డౌన్ కారణంఆ చివరి షెడ్యూల్ని చిత్ర బృందం పూర్తి చేయలేకపోయింది. తాజాగా సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఒక్కో సినిమా సెట్స్పైకి వెళుతోంది. `అల్లు అదుర్స్` కూడా తాజా షెడ్యూల్ని వచ్చే నెలలో మొదలుపెట్టోతున్నారట. అను ఏమన్యూయల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.