కరోనా మహమ్మారి రోజు రోజుకీ ప్రమాద స్థాయికి చేరుకుంటున్న వేళ దానికి వ్యాక్సిన్ని హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ రూపొందించడం ఆసక్తికరంగా మారింది. భారత్ బయోటెక్ సంస్థ `కో వ్యాక్సిన్` పేరుతో ఈ వ్యాక్సిన్ని తయారు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మంగళవారం వెల్లడించింది. దీన్ని జూలైలో మనుషులపై ప్రయోగాత్మకంగా ప్రయోగించనున్నారట.
హైదరాబాద్లోని జెనోమ్ వ్యాలీకి చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఐసీఎంఆర్, పుణేలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థతో కలిసి ఈ వ్యాక్సిన్ని రూపొందించిందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సోషల్ మీడియా వేదికగా ఆ సంస్థని అభినందించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో మీ కృషి అభినందనీయమని ప్రశంసించారు.
ఈ విషమ పరిస్థితుల్లో వ్యాక్సిన్ రూపొందించడం గర్వంగా వుందని భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ వ్యాక్సిన్ని జంతువులపై ప్రయోగించామని, అవి క్షేమంగా వున్నాయని, వాటి రోగ నిరోధక శక్తి కూడా పెరిగిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.