Homeటాప్ స్టోరీస్పవర్ స్ట్రోమ్ కి రెడీ గా ఉండండి - భీమ్లా నాయక్ నిర్మాత పిలుపు

పవర్ స్ట్రోమ్ కి రెడీ గా ఉండండి – భీమ్లా నాయక్ నిర్మాత పిలుపు

పవర్ స్ట్రోమ్ కి రెడీ గా ఉండండి - భీమ్లా నాయక్ నిర్మాత పిలుపు
పవర్ స్ట్రోమ్ కి రెడీ గా ఉండండి – భీమ్లా నాయక్ నిర్మాత పిలుపు

రెండు రోజుల క్రితం వరకు భీమ్లా నాయక్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరు చెప్పలేదు. కానీ రాత్రికి రాత్రే నిర్మాత నాగ వంశీ ఫిబ్రవరి 25 న వస్తున్నామని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఈ ప్రకటన తర్వాత కూడా అందరిలో అనుమానాలు అలాగే ఉన్నాయి. చెప్పారు కానీ ఆ సమయానికి వస్తారా..లేక చివరి నిమిషంలో వాయిదా వేస్తారా అనే అనుమానాలు ఉన్నాయి. కాగా ఈరోజు షూటింగ్ పూర్తి అయినట్లు తెలుపడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కొద్దీ సేపటి క్రితం మరోసారి రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ..సరికొత్త పోస్టర్ రిలీజ్ చేయడం తో అభిమానులు ఫిబ్రవరి 25 ఫిక్స్ అంటూ ఫిక్స్ చేసుకుంటున్నారు.

ఈ సినిమా రిలీజ్ పై అభిమానులకు కొన్ని అనుమానాలు రేకెత్తుతున్న వేళ.. ఎలాంటి అనుమానాలు లేవని.. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 న థియేటర్లోకి వస్తున్నట్లు మరోసారి ట్విట్టర్ లో తెలుపుతూ..పవర్ స్ట్రోమ్ కి రెడీ గా ఉండండి అంటూ నాగ వంశీ పిలుపునిచ్చారు. ఈ పిలుపు తో ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు , సినీ లవర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. `వకీల్ సాబ్` చిత్రం తరువాత పవన్ నుంచి వస్తున్న మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ లిరికల్ వీడియోలతో సినిమాపై అంచనాలు స్కై హైకి చేరుకున్నాయి. రానా నిత్యామీనన్ సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించడం.. తమన్ అందించిన సంగీతం సినిమాకు మరింత హైప్ ని తీసుకొచ్చింది.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 21న భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మరి బాక్స్ ఆఫీస్ వద్ద భీమ్లా సందడి ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All