కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలా కుతలం చేస్తున్న విషయం తెలిసిందే. వందల కొద్ది సంస్థలు దీన్ని అరికట్టేందుకు వ్యాక్సిన్ని తీసుకురావాడానికి ప్రయోగాలు చేస్తున్నారు. అయితే సోమవారం హీరో బాలకృష్ణ కరోనా వ్యాక్సిన్పై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కరోనాకు వ్యాక్సిన్ ఇంత వరకు రాలేదని, ఇకపై కూడా రాదని స్పష్టం చేశారు. విర్గో పిక్చర్స్ బ్యానర్పై హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం `సెహరి`. జ్ఞానసాగర్ దర్శకుడు.
అద్వయ జిష్ణురెడ్డి, శిల్నా చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ని సోమవారం హీరో బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైరస్కు వ్యాక్సిన్ ఇంకా రాలేదని, అది రాకపోవచ్చునని అన్నారు. వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ స్వీయ అవగాహన కలిగి ఉండాలన్నారు. `కరోనా మనతోనే ఉండబోతోంది. మనం దానితో కలిసి జీవించాలి. టీకా గురించి వార్తలు ఉన్నాయి. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి` అన్నారు బాలకృష్ణ.
ఈ చిత్ర నిర్మాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మేనల్లుడు. దీంతో మాజీ సిఎంతో తనకున్న బంధాన్ని, వారిద్దరూ నిజాం కాలేజీలో ఎలా చదువుకున్నారో బాలయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చిత్ర నిర్మాణంలో జాగ్రత్తగా ఉండాలని యువ నిర్మాతలను కోరిన ఆయన, ఈ చిత్రం కోసం తెలివిగా ఖర్చు చేయాలని కోరారు. హీరోయిన్ సిమ్రాన్ చౌదరి అందంపై ప్రశంసలు కురిపించారు. ఆమెతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని బాలయ్య చెప్పడంతో సిమ్రాన్ చౌదరి ఒక్కసారిగా షాకయింది.