వర్గో పిక్చర్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.1 గా మొదలైన చిత్రం `సెహరి`. హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కీలక పాత్రలో నటిస్తున్నారు. జ్ఞాన సాగర్ దర్శకుడు. అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పాచౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగళవారం హైదరాబద్లో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నివ్వగా అల్లు బాబి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత భరత్ నారంగ్ స్క్రిప్ట్ అందజేశారు.
చిత్ర నిర్మాతలు అద్వయ జిష్ణు, శిల్పా చౌదరి మాట్లాడుతూ “సెహరి` ఒక న్యూఏజ్ లవ్స్టోరీ. ఈ మూవీకి మంచి టీమ్ కుదిరింది. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. పక్కగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుని షూటింగ్ కి రెడీ అయ్యాం. కోటి గారు తప్ప మిగతా టీమ్ అంతా కొత్తవారే. మంచి టీమ్తో కలిసి వర్క్ చేయబోతున్నందుకు చాలా ఎగ్జైటింగ్గా వుంది` అన్నారు. సినిమాలో హీరో తండ్రిగా పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాను. సెహరి అంటే సెలబ్రేషన్. ఈ సినిమా ప్రారంభోత్సవం మా టీమ్ అందరికి ఒక సెలబ్రేషన్. వండర్ ఫుల్ టీమ్ కుదిరింది. తప్పకుండా ఆర్టిస్ట్గా నాకు మంచి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుంది` అని సంగీత దర్శకుడు కోటి చెప్పారు.
హీరో హర్ష్ కనుమిల్లి మాట్లాడుతూ ` మా ఫ్రెండ్స్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథని రాశాను. న్యూ ఏజ్ లవ్స్టోరీగా ఈ మూవీ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. అభినవ్ గోమటం పాత్ర ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. ప్రశాంత్ విహారి ఇప్పటికే రెండు పాటల్ని సిద్ధం చేశారు` అని అన్నారు. వచ్చే వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. కోటిగారు కేవలం 20 నిమిషాలు కథ విని ఓకే చెప్పారు. హరష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి పాత్రలు కొత్తగా వుంటాయి. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్లాస్ అవుతుంది` అని దర్శకుడు జ్ఞాన సాగర్ అన్నారు. బాలకృష్ణ, ప్రనీత్ కళ్లెం, అనీషాకెడ్డి, అక్షిత శెట్టి, రాజేశ్వరి, శ్రిస్తి, అనిల్కుమార్ తదితరులు నటిస్తున్నారు.