నందమూరి బాలకృష్ణ నటించిన సంచలన చిత్రం `సింహా`. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించి బాలయ్య కెరీర్ని మళ్లీ విజయాల బాట పట్టించింది. 2010 ఏప్రిల్ 30న విడుదలైన ఈ చిత్రం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంచలన చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి తెర వెనుక ఆసక్తికరమైన స్టోరీ జరిగింది. ఆ సమయంలో వరుస ఫ్లాపుల్లో వున్నారు బాలకృష్ణ.
ఈ ఫేజ్ నుంచి తనని బయటపడేసే దర్శకుడు కావాలి. బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. గత చిత్రాలకు భిన్నంగా వుండాలి. ఆ టైమ్లో బాలయ్య చెవికి చరిన పేరు బోయపాటి శ్రీను. వెంటనే ఫోన్ కొట్టారట బాలయ్య.. బాలయ్య నుంచి ఫోన్ వచ్చే సరికి ఎందుకు చేశారా అని బోయపాటిలో కంగారు.. .మిమ్మల్ని ఒకసారి కలవాలి వస్తారా.. బాలయ్య వాయిస్.. బాబు నేను విజయవాడలో ఓ పెళ్లిలో వున్నాను. వచ్చాక కలవొచ్చా.. బోయపాటి సమాధానం.. విజయవాడ నుంచి తిరిగి వచ్చాక బాలయ్యకు కథ చెప్పారు బోయపాటి..అయితే కథని 24 నిమిషాలు మాత్రమే చెప్పారట.
24 నిమిషాలు విన్న బాలయ్య మూడవ రోజు ఫోన్ చేసి మనం ఈ సినిమా చేస్తున్నాం అన్నారట. అలా `సింహ` తెరపైకొచ్చింది. 16 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని 112 రోజుల్లో పూర్తి చేశారట. ఈ సినిమా తరువాత ఇదే కాన్ఫిడెంట్తో వీరిద్దరి కాంబినేషన్లో `లెజెండ్` చిత్రం వచ్చింది. అదీ సూపర్ హిట్టే. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ముచ్చటగా మూడవ సినిమా తెరకెక్కుతోంది. మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూ్ ఇటీవలే పూర్తి చేశారు.