స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ చిత్రానికి బడ్జెట్ కటింగ్ మొదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సింహా, లెజెండ్ చిత్రాల తరువాత బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణల కలయికలో ముచ్చటగా మూడవ చిత్రం తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన బీబీ3 ఫస్ట్ రోర్ ఈ మూవీపై అంచనాల్ని పెంచేసింది.
ఇందులో హీరో బాలకృష్ణ మాసీవ్ పాత్రతో పాటు అఘోరాగా రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే కొన్ని కీలక ఘట్టాలని ఛేజింగ్ సీన్ని పూర్తి చేశారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ముందు ఈ చిత్రానికి 80 కోట్లు బడ్జెట్ ని కేటాయించారట. అయితే తాజా పరిస్థితుల నేప్యంలో ఆ బడ్జెట్ని సగానికి సగం తగ్గించి 40 కోట్లకు కుదించారని ఇండస్ట్రీ టాక్.
హీరో బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా తన పారితోషికాన్ని తగ్గించుకున్నారని తెలిసింది. ముందు అనుకున్న దానికి భిన్నంగా మినిమమ్ బడ్జెట్తో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని బోయపాటి ప్లాన్ చేసినట్టు టాక్. ఇంతకు ముందు వారణాసి షెడ్యూల్ని ప్లాన్ చేశారు అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆ షెడ్యూల్ని హైదరాబాద్లోనే సెట్లో పూర్తి చేయాలనుకుంటున్నారట. ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ వర్గాలు మాత్రం బోయపాటి కాంప్రమైజ్ అవుతున్నారా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారట.