ఇటీవల మలయాళంలో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుం కోశియుమ్’. పృథ్విరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ కలిసి నటించిన ఈ చిత్రం త్వరలో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఏ చిత్రానికి సాచి దర్శకత్వం వహించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు కన్నుమూశారు.
ఈనెల 15న ఆయన హిప్ కు త్రిచూర్లోని ఓ ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స జరిగింది. మరుసారి ఆపరేషన్ జరుగుతుండగా హార్ట్ ఏటాక్ రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారని బ్రెయిన్ డామేజ్ కారణంగా ఆయన చనిపోయారని డాక్టర్లు వెల్లడించారు.
‘అయ్యప్పనుం కోశియుమ్’ తో మళయాళ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన సాచి మరణ వార్త మలయాళీ చిత్ర సీమను శోకసంద్రంలోకి నెట్టేసింది. సాచి మృతి పట్ల పలువురు మలయాళ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
- Advertisement -