యువ దర్శకుడు నాగ్ అశ్విన్ `మహానటి` చిత్రంతో వైజయంతీ మూవీస్కి పూర్వవైభవాన్ని తీసుకొచ్చారు. ముందు 12 కోట్లతో చేయాలనుకున్న ఈ చిత్రాన్ని 22 కోట్లతో పూర్తి చేసి అద్భుతచిత్రంగా మలిచారు. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే సంస్థలో నాగ్ అశ్విన్ `ఎవడే సుబ్రమణ్యం` చిత్రాన్ని చేశారు. ఇదే ఆయన తొలి చిత్రం. ఈ సినిమానే అతనికి `మహానటి`ని తెరపై ఆవిష్కరించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
`మహానటి` తరువాత నాగ్ అశ్విన్ ఎలాంటి కథ చెబుతాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. అదే తరహాలో ఆయన మామగారైన అశ్వనీదత్ కూడా ఎదురుచూశారట. ఇటీవల ప్రభాస్ కోసం చేసిన కథ విని ఆశ్చర్యపోయారట. ప్రభాస్ని మా సంస్థ ద్వారానే పరిచయం చేయాలనుకున్నామని, అది కుదరలేదని, ఈలోగా `బాహుబలి`తో ప్రభాస్ దేశంలోనే అగ్రహీరో అయ్యారని అశ్వనీదత్ వెల్లడించారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారాయన.
వందల కోట్ల ప్రాజెక్ట్ ఇది. దీనికి ప్రభాస్ అయితేనే వర్కవుట్ వుతుందని నాగ్ అశ్విన్ అడిగాడు. కథ వినిగానే ప్రభాస్ ఈ పక్రాజెక్ట్కి ఓకే చెప్పాడు