విజయ్ దేవరకొండ నటించిన `అర్జున్రెడ్డి` ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. టీజర్ నుంచే ఈ మూవీ ఓ గేమ్ ఛేంజర్లా వుందనే చర్చ జరిగింది. టీజర్లో విజయ్ దేవరకొండతో కలిసి రమాన్స్ చేసిన సుందరి ఎవరా అని అంతా ఆరా తీశారు. ఆమె సాయి సుధ. ఇటీవల శ్యామ్ కె. నాయుడు తనని లైంగికంగా వాడుకున్నాడని సంచలన ఆరోపణలు చేస్తూ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఆ తరువాత రంగంలోకి దిగిన పోలీసులు శ్యామ్ కె. నాయుడిని రిమాండ్కు తరలించడం తెలిసిందే.
ఈ సంఘటనతో టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సాయి సుధ మరోసారి హాట్ టాపిక్గా మారింది. `అల్లరి` రవిబాబు వరుస ఫ్లాపుల తరువాత పక్కా అడల్ట్ కంటెంట్తో రూపొందిస్తున్న చిత్రం `క్రష్`. ఫస్ట్ పెప్ పేరుతో గురువారం దీనికి సంబంధించిన టీజర్ని రిలీజ్ చేశారు. ఇందులో మొత్తం అడల్ట్ కంటెంటే. బూతు డైలాగ్లే. బూతుని నమ్ముకుని యూత్ని టార్గెట్ చేస్తూ రవిబాబు ఈ మూవీని రపొందించినట్టు తెలిసిపోయింది.
ఈ ఫస్ట్ పెప్లో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలిచింది సాయి సుధ. స్లీవ్ లెస్ రెడ్ కలర్ బ్లౌజ్లో యెద అందాల్ని కనువిందు చేస్తూ సాయి సుధ రచ్చ చేసింది. నడుము అందాల్ని చూపిస్తూ కుర్రకారుని హీటెక్కించేసి `క్రష్ మూవీపై అంచనాల్ని పెంచేసింది. ప్రస్తుతం సాయి సుధకు సంబంధించిన ఫస్ట్ పెప్ ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఆమెకు సంబంధించిన క్లిప్స్ చూసిన వాళ్లంతా ఈ దెబ్బతో సాయి సుధ పాపులర్ కావడం గ్యారెంటీ అంటున్నారు.