Homeటాప్ స్టోరీస్చంద్రబాబు - పవన్ పలకరించుకోలేదు

చంద్రబాబు – పవన్ పలకరించుకోలేదు

ap cm chndrababu naidu and pawan kalyan visits dasavatara venkateshwara swamy templeఈరోజు ఉదయం ఆంధప్రదేశ్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పాల్గొన్నారు అయితే ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదంటే నమ్మండి . ఇద్దరు కూడా బద్ద శత్రువుల్లా పక్క పక్కనే ఉన్నప్పటికీ పలకరించు కోలేదు . గత ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రచారాన్ని కూడా నిర్వహించాడు పవన్ కళ్యాణ్ .

అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు ఇచ్చిన పవన్ ఈసారి మాత్రం పోటీ చేస్తానని , అలాగే అభ్యర్థులను కూడా నిలబెడతానని అధికార తెలుగుదేశం పార్టీ పై యుద్ధం ప్రకటించాడు పవన్ కళ్యాణ్ . చంద్రబాబు తో అంటకాగిన పవన్ ఇప్పుడు బాబు నీడ అంటేనే ఆవేశానికి లోనౌతున్నాడు . గతకొంత కాలంగా అదేపనిగా చంద్రబాబు పై నారా లోకేష్ పై విమర్శలు గుప్పిస్తున్నాడు పవన్ . అయితే ధార్మిక కార్యక్రమం కాబట్టి అందునా పాత మిత్రులు కాబట్టి ఎదురు పడినప్పుడైనా పలకరించుకుంటారేమో అని అనుకుంటే ఉప్పు – నిప్పు లాగే అయ్యింది తాజాగా . చంద్రబాబు ని అదేపనిగా విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ని అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ని మాత్రం అస్సలు విమర్శించడం లేదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All