ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు పార్టీ అయిన తెలుగుదేశం ని ఓడించడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యమట ! గత ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు కి మద్దతుగా నిలిచిన పవన్ 2019 లో జరగబోయే ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థిగా రంగంలోకి దిగుతున్నాడు . ఆంధప్రదేశ్ లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని అధికారికంగా ప్రకటించాడు పవన్ కళ్యాణ్ . చంద్రబాబు ని ఓడించడమే లక్ష్యంగా అటు జగన్ ఇటు పవన్ కళ్యాణ్ లు పోటీ పడుతున్నారు అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా చంద్రబాబు ఓటమి ని కోరుకుంటోంది ప్రగాడంగా .
ఇప్పటివరకైతే ఎన్నికల పొత్తు లేదు కానీ తీరా ఎన్నికల సమయానికి మాత్రం జనసేన బీజేపీ తో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు ఎందుకంటే చంద్రబాబు ని ప్రత్యేక హోదా విషయంలో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో జరుగుతున్న అవినీతి పై కానీ అదేపనిగా విమర్శిస్తున్నారు పవన్ కానీ ప్రధాని నరేంద్ర మోడీ ని మాత్రం పల్లెత్తు మాట కూడా అనడం లేదు దాంతో ఎన్నికల నాటికి పొత్తు ఉన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . పొత్తుల మాట ఎలా ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న చంద్రబాబు ని అధికారానికి దూరం చేయాలనీ కంకణం కట్టుకున్నాడు పవన్ . అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నామని ప్రకటించాడు .