భారత క్రికెట్ జట్టు కెప్లెన్ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశర్మ సోమవారం పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోమవారం సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
`మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. సోమవారం మధ్యాహ్నం మాకు పాప జన్మించిన విషయాన్ని తెలియజేస్తుంన్నందుకు ఎంతో సంతోషంగా వుంది` అని తెలిపారు విరాట్ కోహ్లీ.
ఈ సందర్భంగా ట్విట్టర్లో ఓ లెటర్ని పోస్ట్ చేశారు విరాట్. `మీ ప్రేమ, ప్రార్థనలకు, శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. అనుష్క, పాప క్షేమంగా వున్నారు. పాప రాకతో మా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ సమయంలో మాకు కాస్త ఏకాంతాన్ని కలిగిస్తారని ఆశిస్తున్నా` ట్వీట్ చేశారు. గత ఏడాది అనుష్కతో వున్న ఫొటోని షేర్ చేస్తూ `జనవరిలో మేం ముగ్గురం కాబోతున్నాం` అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
అనుష్కకు ఆగస్టులో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. అప్పటి నుంచి అనుష్క డాక్టర్లు చెప్పిన సలహాలు పాటిస్తూ సుఖ ప్రసవం కోసం వర్కవుట్లు చేస్తోంది. అందుకు సంబంధించిన ప్రతీ ఫొటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ వచ్చింది. ఇటీవల బేబీ బంప్తో ఫొటో షూట్ చేయడంతో ఆ ఫొటోలు నెట్టింట సందడి చేశాయి.