Homeటాప్ స్టోరీస్స్వీటీ కెమెరామెన్ అయిన వేళ‌..!

స్వీటీ కెమెరామెన్ అయిన వేళ‌..!

స్వీటీ కెమెరామెన్ అయిన వేళ‌..!
స్వీటీ కెమెరామెన్ అయిన వేళ‌..!

స్వీటీ కెమెరామెన్‌గా మారిపోయింది. త‌ను న‌టిస్తున్న సినిమా లొకేష‌న్‌లో జ‌రుగుతున్న ఆన్ సెట్స్ విష‌యాల్ని కెమెరాలో బంధించే ప్ర‌య‌త్నం చేసింది. ..వివ‌రాల్లోకి వెళితే… అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంమ‌త్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మాధ‌వ‌న్ మైఖేల్ మ్యాడ్స‌న్‌, అంజ‌లి, షాలిని పాండే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

కోన వెంకట్‌తో క‌లిసి టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మూగ‌, చెవిటి అమ్మాయి‌గా అనుష్క ఓ విభిన్న‌మైన పాత్ర‌లో న‌టించిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. ఏప్రిల్ 2న తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్చేయాల‌ని ప్లాన్ చేశారు. ముందు జ‌న‌వ‌రి 31న రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసి ఏప్రిల్ 2కు వాయిదా వేశారు.

- Advertisement -

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కార‌ణంగా మ‌ళ్లీ రిలీజ్ వాయిదా ప‌డింది. లాక్‌డౌన్ మే 7తో ముగుస్తుండ‌టంతో రిలీజ్ ఎప్పుడ‌నే విష‌యంలో ఆ త‌రువాతే క్లారిటీ రానుంది., ఇదిలా వుంటే శుక్ర‌వారం చిత్ర ద‌ర్శ‌కుడు హేమంత్ మ‌ధుక‌ర్ అనుష్క‌కు సంంధించిన ఓ ఫొటోని షేర్ చేశారు. భుజంపై కెమెరా పెట్టుకుని ఆన్ లొకేష‌న్‌లో హ‌డావిడి చేస్తున్న అనుష్క ఫొటో ఆక‌ట్టుకుంటోంది. ఇంత‌కీ స్వీటీ ఏం షూట్ చేసింది. ఆ ఆన్ లొకేష‌న్ విశేషాలేంట‌నేది మాత్రం ద‌ర్శ‌కుడు రివీల్ చేయ‌లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All