Homeగాసిప్స్ఒక‌టే బ‌యోపిక్‌.. ఇద్ద‌రు హీరోయిన్‌ల పోటీ!

ఒక‌టే బ‌యోపిక్‌.. ఇద్ద‌రు హీరోయిన్‌ల పోటీ!

ఒక‌టే బ‌యోపిక్‌.. ఇద్ద‌రు హీరోయిన్‌ల పోటీ!
ఒక‌టే బ‌యోపిక్‌.. ఇద్ద‌రు హీరోయిన్‌ల పోటీ!

అడ్వాన్డ్‌గా ఆలోచించి 20 ఏళ్ల క్రిత‌మే త‌న ఆలోచ‌న‌ల్ని సినిమాల రూపంలో తెర‌పైకి తీసుకొచ్చి అబ్బుర‌ప‌రిచిన ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు. `ఆదిత్య 369` ఇందుకు చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణగా చెప్పుకోవ‌చ్చు. అలాంటి ద‌ర్శ‌కులు గత కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్నారు.
`ఆదిత్య 369`కు సీక్వెల్‌గా `ఆదిత్య 999` పేరుతో ఓ భారీ సైన్స్ ఫిక్ష‌న్‌ని సింగీతం ప్లాన్ చేశార‌ని, అయితే దాన్ని బాల‌య్య చేయ‌డానికి ఆస‌క్తి చూపించినా చాలా వర‌కు మార్పులు చేయాల‌ని చెప్ప‌డంతో ఆ క‌థ ప్ర‌స్తుతం హోల్డ్‌లోకి వెళ్లిపోయింది.

తాజాగా ఓ గాయ‌ని జీవిత క‌థ‌ని సిద్ధం చేసిన ఆయ‌న ఆ క‌థ‌ని బ‌యోపిక్‌గా మ‌ల‌చాల‌ని స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. మెంగ‌ళూరుకు చెందిన దేవ‌దాసి నాగ‌ర‌త్న‌మ్మ క‌థ ఆధారంగా ఈ బ‌యోపిక్ తెర‌పైకి రానున్న‌ట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించ‌నుంద‌ట‌. అయితే ఈ చిత్రం కోసం ఇద్ద‌రు క్రేజీ భామ‌లు పోటీప‌డుతున్న‌ట్టు లేటెస్ట్ న్యూస్‌.

- Advertisement -

ఇటీవ‌లే ద‌ర్శ‌కుడు  సింగీతం శ్రీ‌నివాస‌రావు హీరోయిన్ అనుష్క‌కి ఈ క‌థ‌ని వినిపించార‌ట‌. క‌థ న‌చ్చ‌డంతో అనుష్క వెంట‌నే అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. అయితే అనుష్క ఒక‌వేళ త‌ప్పుకుంటే మాత్రం స‌మంత చేయ‌డానికి రెడీ అంటోంద‌ట‌. దేవ‌దాసి గాయ‌నిగా మారి ఆ త‌రువాత చివ‌రి ద‌శ‌లో యోగినిగా శేష‌జీవితాన్ని ముగించిన ఓ యువ‌తి క‌థ కావడంతో ఈ సినిమా కూడా త‌న‌కు `మ‌హాన‌టి` త‌ర‌హాలో గుర్తింపుని తెచ్చిపెడుతుంద‌ని సామ్ భావిస్తోందిట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All