`ప్రేమమ్`తో మలయాళ ప్రేక్షకులనే కాదు తెలుగు ప్రేక్షకుల్ని కూడా తన అందంతో మెస్మరైజ్ చేసింది మలయాళీ సోయగం అనుమపమ పరమేశ్వరన్. కర్లింగ్ హెయిర్స్తో స్కూల్కి వెళ్లే అమ్మాయిగా ఆకట్టుకుంది. తాజాగా తను మళ్లీ పాఠశాలకు వెళుతున్నట్టు కనిపిస్తోంది. `ప్రేమమ్`లో అనుపమ పాఠశాల విద్యార్థినిగా కనిపించి తనదైన హావ భావాలతో కట్టిపడేసింది. తెలుగులో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా చేతిలో వున్న అనుపమ ప్రస్తుతం మళ్లీ పాఠశాలకు వెళుతున్నట్టు గాతెలుస్తోంది.
అనుపమ తెలుగులో అక్షరాలు రాయడం.. నేర్చుకోవడం మొదలుపెట్టింది. అంటే మళ్లీ బడికి వెళుతోందన్న మాట. ఈ సందర్భంగా తను తెలుగు రాయడం నేర్చుకున్న ఫొటోలను.. బుక్లో తెలుగు అక్షరాలని నేర్చుకుంటున్న తీరుకి సంబంధించిన ఫొటోలని అభిమానులతో పంచుకుంది.
అనుపమ తెలుగులో మాట్లాడగలదు కాని రాయలేదు. అయితే తాజాగా ఆమె తెలుగు అక్షరాలు రాయడం చదవడం నేర్చుకుంటుండటం ఆసక్తికరంగా మారింది. ఒక మలయాళ అమ్మాయి తెలుగు రాయడం నేర్చుకోవడం చాలా బాగుంది. అనుపమ తను షేర్ చేసిన ఫోటోలకు ` ఒక కొత్త లక్ష్యం… ఈ అందమైన పుస్తకానికి ధన్యవాదాలు గోపి గారు ’ అని శీర్షికనిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇన్ స్టాలో సందడి చేస్తున్నాయి. అనుమపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తమిళంలో `నిన్ను కోరి` ఆధారంగా తెరకెక్కిన `తల్లి పోగాదే` చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతోంది.