తెలుగులో సుడిగాలి ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాల్లో నటించేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అయితే సరైన ప్లానింగ్ లేని కారణంగా చాలా సినిమాలు బాల్చీ తన్నేయడంతో వచ్చిన లైమ్ లైట్ మొత్తం పోయింది. ఈ ఏడాది రాక్షసుడు సినిమాతో హిట్ అందుకున్నా అందులో అనుపమ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు.
ఈ నేపథ్యంలో మల్లు భామను పట్టించుకునే నిర్మాత/హీరో దొరకడం లేదు. సినిమాలు లేవని కామ్ గా కూర్చుంటే ఇండస్ట్రీ మర్చిపోతుంది కాబట్టి అనుపమ రోజుకో రకమైన ఫోటోషూట్ తో ఇన్స్టాగ్రామ్ ను హోరెత్తిస్తోంది. ఈ ఫోటోలు చూసైనా భామకు అవకాశాలివ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తెలుగులో అవకాశాలు సన్నగిల్లడంతో అనుపమ మళ్ళీ మలయాళ సినిమాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -
Credit: Instagram
- Advertisement -