Homeటాప్ స్టోరీస్సైరా పై వివాదాలు మొదలయ్యాయి

సైరా పై వివాదాలు మొదలయ్యాయి

another controversy on sye raa narasimha reddyమెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ” సైరా ……. నరసింహారెడ్డి ” వివాదాల్లో చిక్కుకుంది . ఇప్పటికే సైరా నరసింహారెడ్డి కోసం వేసిన భారీ సెట్ ని రెవిన్యూ అధికారులు కూల్చేయగా తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు ఆ సినిమాపై దుమ్మెత్తి పోస్తున్నారు . మాకు తెలియకుండా సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నారు కానీ మాకు కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదని అలాగే దర్శకులు సురేందర్ రెడ్డి మా ఊరు కోయిలకుంట్లకు వచ్చి సినిమా చేస్తున్న విషయం కూడా చెప్పలేదు అంటూ ఆరోపణ చేస్తున్నారు .

ఈరోజు ఉదయం ఓ ఛానల్ లో కూర్చున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశానికి చెందిన వాళ్ళు మాకు అవమానం చేసారని ఆరోపించగా చరణ్ కు సన్నిహిత నిర్మాత అయిన ఎన్వీ ప్రసాద్ స్పందించాడు . లైవ్ షోలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు ఉండగా అదే షోలో ఫోన్ ఇన్ కు వచ్చి నన్ను వచ్చి స్వయంగా కలవండి మీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు . అయితే ఒకదశలో ఎన్వీ ప్రసాద్ బెదిరించే ధోరణిలో మాట్లాడాడు కూడా . ఇప్పటికే సైరా సెట్ కూల్చేయగా , ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు మీడియాకు ఎక్కడంతో కొత్త తలనొప్పి వచ్చింది మరి .

- Advertisement -

English Title: another controversy on sye raa narasimha reddy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All