కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ సమయంలో నైతిక బాధ్యతగా.. “ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, సాంఘికంగా, సామాజికంగా అన్నిరకాల కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సంయమనం పాటించండి.” అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్లు, శాస్త్రవేత్తలు నిపుణులు,సామాజిక కార్యకర్తలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాకూడా కొంతమంది తమ పద్ధతి అసలు మార్చుకోవడం లేదు.
ముఖ్యంగా సినిమా తారలు అనేక మంది ఇప్పటికే తమ సినిమా రిలీజై షూటింగ్ లు, ఇతర కార్యక్రమాలు వాయిదా వేసుకొని ఇంటికి పరిమితమై… తమ సామాజిక, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలను కరోనా వైరస్ ను ఎదుర్కొనే దిశగా అవగాహన కలిగిస్తున్న నేపథ్యంలో కూడా.. కొంత మంది సెలబ్రిటీలు మాత్రం తమ వ్యక్తిగత స్వార్థం కోసం సామాజిక భద్రత లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇక బుల్లితెరపై తన అందచందాలతో ఆకట్టుకుంటున్న యాంకర్ రష్మి తాజాగా ఒక వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం కోసం రాజమండ్రి వస్తున్నానని.. అందరూ అక్కడ కలుద్దామని, ప్రజలు అభిమానులు అందరూ భారీ సంఖ్యలో విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు ఇవ్వటం వివాదాస్పదంగా మారుతోంది. ఒక అడుగు ముందుకేసి సదరు నిర్వాహకులు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ప్రకటిస్తూనే తమ సోషల్ మీడియా అకౌంట్ లో మాత్రం 10:30 p.m. అని అక్షర దోషంతో ప్రచురించటం గమనార్హం. ఇక తమను సామాజిక మాధ్యమాలపై అసభ్య పదజాలంతో దూషించిన వారిపట్ల అదేస్థాయిలో విరుచుకుపడే యాంకర్ రష్మీ.. ఇలాంటి విపరీతమైన విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు సంయమనంతో వ్యవహరించకుండా.. స్వలాభం తో వ్యవహరించడం పట్ల ప్రజల నుంచి అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఇలా చేస్తూ.. సాటి ప్రజలకు ఏం మెసేజ్ లు ఇస్తారో..! అర్ధం కాదు.
See u there https://t.co/vUwTwTaByO
— rashmi gautam (@rashmigautam27) March 19, 2020
Credit: Twitter