`గదార్ ఏక్ ప్రేమ్ కథ` చిత్రంతో దేశ వ్యాప్తంగా అమీషా పటేల్ గుర్తింపుని సొంతం చేసుకుంది. తెలుగులోనూ `బద్రి ` మూవీతో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల్నీ అలరించింది. ఆ తరువాత ప్రధానంగా హిందీ సినిమాల్లో మాత్రమే నటిస్తూ వచ్చింది. ప్రస్తుతం పంజాబీ, భోజ్పురి చిత్రాల్లో నటిస్తోంది. నిత్యం సోషల్ మీడియా వేదికగా హాట్ వీడియోలు, ఫొటోలతో రచ్చ చేస్తూ ఇంటర్నెట్ని హీటెక్కించేస్తోంది.
తాజాగా బీహార్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎల్జెపి అభ్యర్థి ప్రకాష్ చంద్ర తరపున బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు తనకు ఎదురైన చెడు అనుభవాన్ని అమీషా పటేల్ తాజాగా నెటిజన్లతో పంచుకుంది. అమీషా పటేల్కు ప్రకాష్ చంద్రతో ఎలాంటి సంబంధం లేదు కానీ ఆమె ఈ ప్రచారానికి హాజరయ్యారు.
ప్రకాష్ చంద్ర తరఫున ప్రచారం చేస్తున్నప్పుడు తనకు తనకు దారుణమైన అనుభవం ఎదురైందని అమీషా పటేల్ వెల్లడించింది. తన ప్రాణానికి హాని వుందని భయపడ్డానని ఆమె మీడియాతో అన్నారు. ప్రకాష్ చంద్ర తనను బెదిరించాడని ఈసందర్బంగా అమీషా సంచలన ఆరోపణలు చేసింది. తన గురించి ఎక్కువగా మాట్లాడమని, తనకు ప్రచారం చేయాలని ప్రకాష్ చంద్ర తనని బెదిరించినట్టు తెలిపింది. తాను అతిథిగా బీహార్ వెళ్ళానని, అయితే అక్కడి అనుభవం పూర్తిగా భిన్నంగా ఉందని అమీషా పటేల్ చెప్పారు.
`ఇది ఒక దురదృష్టకరమైన అనుభవం. ప్రకాష్ చంద్ర నా పాపులారిటీని దుర్వినియోగం చేశాడు. నేను అత్యాచారం చేసి చంపబడినా ఆశ్చర్యం లేదు` అని అమీషాపటేల్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రకాష్ చంద్ర మాత్రం అమీషా పటేల్ అసత్య ఆరోపణలు చేస్తోందని, తన బంధువు పప్పుఏ యాదవ్తో ఆమె 15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాకే ప్రచారంలో పాల్గొందని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో అమీషా బీహార్ ఎన్నికల ప్రచారం చుట్టూ వివాదం అలుముకుంది.