Homeటాప్ స్టోరీస్స్పీడు పెంచిన అను ఇమ్మాన్యుయేల్‌!

స్పీడు పెంచిన అను ఇమ్మాన్యుయేల్‌!

స్పీడు పెంచిన అను ఇమ్మాన్యుయేల్‌!
స్పీడు పెంచిన అను ఇమ్మాన్యుయేల్‌!

క్రేజ్‌, సూప‌ర్ హిట్‌ల‌తో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్ల‌ని సొంతం చేసుకున్న హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌. స్వ‌త‌హాగా మ‌ల‌యాళీ అయినా యూఎస్‌లో పుట్టి పెరిగిన ఈ మల‌యాళీ కుట్టి త‌న మాతృభాష మ‌ల‌యాళ చిత్రంతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో నాని న‌టించిన `మ‌జ్ను` చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా ఆ త‌రువాత మాత్రం వ‌రుస ఫ్లాపుల్ని ద‌క్కించుకుంది.

గోపీచంద్‌తో క‌లిసి న‌టించిన `ఆక్సిజ‌న్‌`, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌తో చేసిన `అజ్ఞాత‌వాసి`, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసిన `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, నాగ‌చైత‌న్య‌తో చేసిన `శైల‌జారెడ్డి అల్లుడు`.. ఈ చిత్రాల‌న్నీ వ‌రుస‌గా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ అయ్యాయి. దీంతో అనుకు తెలుగులో సినిమాలు లేకుండా పోవ‌డంతో త‌న మ‌కాంని త‌మిళ ఇండ‌స్ట్రీకి మార్చింది. అక్క‌డ శివ‌కార్తికేయ‌న్‌తో `న‌మ్మ‌వీట్టు పిళ్లై` చిత్రంలో న‌టించింది. తెలుగులో స్టార్ హీరోల చిత్రాల్లో మాత్ర‌మే న‌టించాల‌నుకున్న అను తాజాగా త‌న పంథా మార్చుకుంద‌ట‌.

- Advertisement -

త‌న వ‌ద్ద‌కు ఏ అవ‌కాశం వ‌స్తే దాన్ని ఓకే చేస్తోంది. తాజాగా తెలుగులో మ‌ళ్లీ స్పీడు పెంచేసింది. అల్లు శిరీష్‌తో ఓ చిత్రం, బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌తో మ‌రో చిత్రాన్ని లైన్‌లో పెట్టేసింది. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ న‌టిస్తున్న చిత్రాన్ని సంతోష్ శ్రీ‌నివాస్ రూపొందిస్తున్నారు. ఫ్యామిలీ మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి `అల్లుడు అదుర్స్‌` అనే టైటిల్‌ని ఇటీవ‌లే ఫిక్స్ చేశారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ ఇన్నింగ్స్ అయినా అనూని స‌క్సెస్ బాట ప‌ట్టిస్తుందో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All