ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ `పుష్ప`. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, ముత్యంశెట్టి మీడియా బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్నిఅత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. గంధపు చెక్కట స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇటీవల హీరో బన్నీ కోవిడ్ బారిన పడినా `పుష్ప` షూట్ మాత్రం ఎక్కడా ఆపకుండా కంటిన్యూ చేస్తున్నారు. హీరో లేని సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల మధ్య సిబ్బందిని ఇరాకాటంలో పెట్టి మరీ చిత్ర బృందం షూటింగ్ చేస్తోందంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘పుప్ప` బృందం చివరకు షూట్ను నిలిపివేసింది. ఈ వారం ప్రారంభంలో ఈ చిత్రం షూటింగ్లో ఉండగా హీరో అల్లు అర్జున్ కరోనావైరస్ బారిన పడిన విషయం తెలిసిందే.
భారీ నిర్మాణ సంస్థలన్నీ చాలా రోజుల క్రితమే తమ చిత్రాల షూటింగులను నిలిపివేసినప్పటికీ దర్శకుడు సుకుమార్ మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ పై కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. కానీ కరోనా మహమ్మారి మరింత తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో పరిస్థితిని గమనించిన చిత్ర బృందం షూటింగ్ని నిలిపివేయడంతో ఫహద్ హైదరాబాద్ నుండి కొచ్చిన్ కు బయలుదేరాడు.