గత ఏడాది `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ని సొంతం చేసుకున్న బన్నీ అదే ఉత్సాహంతో `పుష్ప` చిత్రాన్ని పట్టాలెక్కించారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ముత్యంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీమేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రంగమ్మత్త అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది.
బన్నీ గంధపు చెక్కల స్మగ్లర్గా ఊరమాస్ పాత్రలో లారీ డ్రైవర్గా కనిపించనున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐదుభాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలై అంచనాల్ని అమాంతం స్కై హైకి చేర్చేసింది. ఇదిలా వుంటే ఈ మూవీ షూటింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో భారీ జాగ్రత్తల మధ్య జరుగుతోంది.
ఇటీవలే అనసూయ ఈ మూవీ సెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చాలా వరకు స్టార్ హీరోలు సెకండ్ వేవ్ భయంతో పాటు తమకు సన్నిహితంగా వుండే వ్యక్తిగత సిబ్బంది కోవిడ్ బారిన పడటం, కొంత మంది చనిపోవడంతో తమ సినిమాల షూటింగ్లని అర్థాంతరంగా ఆపేసి స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయారు. ఇలా షూటింగ్ ఆపేసి స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన హీరోలు రామ్చరణ్, ప్రభాస్, తాజాగా మహేష్ .. ఇలా వరుసగా హీరోలు స్వీయ నిర్భంధంలోకి వెళుతుండటంతో `పుష్ప` టీమ్ షూటింగ్ కంటిన్యూ చేయాలా లేక ఆపాలా అని భయపడుతోందట.