ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో హైవోల్టేజ్ ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `పుష్ప`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ముత్యంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీమేకర్స్ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో పాటు బన్నీకి కరోనా సోకడంతో ఆపేశారు.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత `ఐకాన్`ని పక్కన పెట్టిన బన్నీ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 21వ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. కానీ ఇటీవల జరిగిన పరిణామాల కారణంగా కొరటాల శివ `ఆచార్య` తరువాత ఎన్టీఆర్ 30వ చిత్రానికి కమిట్ అయ్యారు. దీంతో షాకైన బన్నీ తన ప్లాన్ ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. కొరటాల యంగ్టైగర్ సినిమాని ముందుకు తీసుకురావడంతో తనతో చేయాలనుకున్న 21వ చిత్రాన్ని బన్నీ మరో డైరెక్టర్తో చేయడానికి రెడీ అయిపోతున్నాడు.
ఏ.ఆర్. మురుగదాస్తో సినిమా చేయాలని `గజిని` నుంచి బన్నీ ఎదురుచూస్తున్నారు. రజనీ `దర్బార్` టైమ్లోనూ దీనిక సంబంధించిన వార్తలు వినిపించాయి. ఈ సమయంలో మీడియా బన్నీతో సినిమా చేయాలనే ప్రయత్నాల్లో వున్నారని తెలిసిందని అడిగితే మురుగదాస్ చర్చలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కి సంబంధించి గీతా ఆర్ట్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇటీవలే మొదలైందట. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.