ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన రేంజ్ ను మరింత పెంచుకునే పనిలో ఉన్నాడు. అల వైకుంఠపురములో వంటి సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై బజ్ చాలానే ఉంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ రీసెంట్ గా ఒక పోస్ట్ చేసాడు. గని చిత్రంలో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా అల్లు బాబీ నిర్మాతగా పరిచయమవుతున్నాడు. అల్లు అర్జున్ రీసెంట్ గా గని సెట్స్ కు వచ్చాడు. అక్కడ కాసేపు గడిపి గని టీమ్ తో ముచ్చటించాడు.
ఈ సందర్భంగా ట్విట్టర్ లో “అల్లు బాబీ నిర్మాతగా తొలి సినిమా నిర్మిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. చిత్ర టీమ్ కు ఆల్ ది బెస్ట్” అని తెలిపాడు.