తెలుగు సినిమా అంటే ప్రతీ పాట, లేదా కీలక సన్నివేశం.. విదేశాల్లో తీయాల్సిందే. అలా తీస్తేనే క్రేజ్. కానీ కరోనా తరువాత లెక్క మారింది. మేకిన్ ఇండియా.. మేడ్ ఇన్ ఇండియా అనే మాట ప్రముఖంగా వినిపిస్తోంది. విదేశాల్లో షూటింగ్లు, విదేశీ టెక్నీషియన్లు అంటే అత్యధిక ప్రాధాన్యతనిచ్చే మన వాళ్లు ఇప్పుడు వద్దంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప` ఈ విషయంలో ముందు వరుసలో నిలబడిందని తెలిసింది.
సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్తో కలిసి ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. శేషాచలం అడువల నేపథ్యంలో సహజత్వానికి అత్యంత దగ్గరగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లోకల్ టెక్నీషియన్లతో తెరకెక్కించబోతున్నారు.
వంద శాతం మేకిన్ ఇండియా ప్రాజెక్ట్గా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రంలో విలన్ పాత్ర మరితం ప్రభావవంతంగా వుంటుందట. అతని పరిచయ సన్నివేశాల కోసం దాదాపు 6 కోట్లని చిత్ర బృందం ఖర్చు చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రాబోతున్న ఈ చిత్రంలో ఊరమాస్ పాత్రలో లారీడ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ రగ్గ్డ్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా అల్లు అర్జున్ షేర్ చేసిన స్థిల్ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఏ స్థాయిలో ఆశ్చర్యపరచనుందో అర్థం మవుతోంది. లాక్డౌన్ తరువాత ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.