లాక్డౌన్ కారణంగా షూటింగ్లు ఆగిపోవడంతో భారీ చిత్రాలైన `ఆర్ఆర్ఆర్`, ఆచార్య, పుష్ప టీమ్లు ఇబ్బంది పడుతున్నాయి. ఈ బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో జరిగిన ప్రత్యేక సమావేశంలో భౌతిక దూరం పాటిస్తూ షూటింగ్ చేస్తామని, వెంటనే ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని, త్వరలోనే టెస్ట్ షూట్ చేస్తానంటూ దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. త్వరలోనే టెస్ట్ షూట్ ని కూడా మొదలుపెట్టబోతున్నారట.
దీన్ని బట్టి `ఆచార్య` షూటింగ్ కూడా మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా వుంటే `పుష్ప` టీమ్ మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చినా మరో రెండు నెలల పాటు వేచి చూడాలని అనుకుంటోందట. ఈ నెల 31తో లాక్డౌన్ గడువు ముగుస్తున్నా దేశ వ్యాప్తంగా, రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో రిస్క్ తీసుకోవడం ఎందుకని రెండు నెలల తరువాతే పరిస్థితులని బట్టి షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.
ఈ టీమ్లో మరీ ముఖ్యంగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం ఆగస్టు వరకు వేచి చూడలి అనుకుంటున్నారట. దీంతో టీమ్ కూడా అప్పుడే చేద్దాం అనే నిర్ణయానికి వచ్చారట. `పుష్ప` చిత్రంలో అల్లు అర్జున్ ఊర మాస్ క్యారెక్టర్లో లారీ డ్రైవర్ పుష్పరాజ్గా కనిపించబోతున్నారు. శేషాచలం అడవుల నేపథ్యంలో గంథపు చక్కల స్మగ్లింగ్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తోంది.