Homeగాసిప్స్అల్లు అర్జున్ కు విపరీతమైన కోపం వచ్చిందట

అల్లు అర్జున్ కు విపరీతమైన కోపం వచ్చిందట

Allu Arjun
Allu Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు విపరీతమైన కోపం వచ్చిందట ఓ మీడియా సంస్థ మీద ! ఎందుకంటే …… అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అది ప్రస్తుతం రెండో షెడ్యూల్ మాత్రమే జరుపుకుంటోంది , ఇక విడుదల ఎప్పుడంటే …… 2020 జనవరిలో అంటే చాలా సమయం ఉంది కానీ ఓ పత్రిక మాత్రం అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల సినిమా మహేష్ బాబు నటించిన ” బ్రహ్మోత్సవం ” చిత్రంలా డిజాస్టర్ కాబోతోంది అంటూ కథనం రాయడమే అల్లు అర్జున్ ఆగ్రహానికి కారణమయ్యింది .

అయితే ఇంకా షూటింగ్ పూర్తికాని సినిమాని డిజాస్టర్ సినిమాతో పోల్చడం ఏంటి ? ఫలితం ఇప్పుడే చెప్పడం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట . లీగల్ గా చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నాడట అల్లు అర్జున్ . ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది . టబు కీలక పాత్రలో నటిస్తుండగా అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All