ఫిలిం ఇండస్ట్రీలని కరోనా చావుదెబ్బకొట్టింది. కరోనా కారణంగా అర్ధాంతరంగా లొక్డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ లన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. షూటింగ్ పూర్తయిన సినిమాలన్నీ థియేటర్స్ బంద్ కావడంతో ఏంచేయాలో తెలియక అయోమయం నెలకొంది.
పరిస్థితిని అంచనా వేసినవారు థియేటర్స్ ఇప్పట్లో తెరిచే పరిస్థితి లేదని గ్రహించి రెడీగా వున్న సినిమాలని ఓటీ టీ లకు అమ్మేసుకుంటున్నారు. కొంత మంది మాత్రం ఇంకా వేచిచూద్దాం థియేటర్స్ లోనే రిలీజ్ చేద్దాం అని నిర్ణయించుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఓటీటీ లొనే రిలీజ్ చేసేస్తున్నారు.
కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’ అమెజాన్ లో ఈనెల 19న రిలీజ్ అవుతోంది. తాజాగా మరో సినిమా కూడా ఓటీ టీ లో డైరెక్ట్ రిలీజ్ కాబోతోంది. అల్లరి నరేష్ నటించిన చిత్రం ‘బంగారు బుల్లోడు’. గిరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రాన్ని అమెజాన్ లో రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం టాక్స్ నడుస్తున్నాయి. వన్స్ ఫైనల్ అయితే ‘బంగారు బుల్లోడు’ ఓటీ టీలో రిలీజ్ కావడం లాంఛనమే.
- Advertisement -