సమంతా ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో సురేష్బాబు సమర్పకుడిగా టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఓ బేబీ . కొరియన్ హిట్ మూవీ ‘మిస్ గ్రానీ’కి తెలుగు రీమేక్గా వచ్చిన ‘ఓ బేబీ’ ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నాగ శౌర్య ముఖ్య పాత్రలో, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లను రాబడుతోంది. 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువతిగా మారిపోయే కథాంశంతో ‘ఓ బేబీ’ తెరకెక్కింది.
కాగా ఇప్పుడు ‘ఓ బేబీ’ని బాలీవుడ్లోనూ తెరకెక్కించాలని సురేశ్బాబు భావిస్తున్నారట. ఇందులో సామ్ పాత్రను ఆలియా భట్తో చేయించాలని ప్రయత్నిస్తున్నారట. అయితే ఆమె వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’, ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్ 2’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో రీమేక్ తీయడం ఇప్పట్లో సాధ్యంకాదేమో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.. ఎలాగైనా ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చెయ్యాలని పట్టుదలతో సురేష్ బాబు వున్నారని ఫిలిం నగర్ టాక్..!!