స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లాస్ట్ సినిమా అల వైకుంఠపురములో విడుదలై ఇటీవలే 50 రోజులు కూడా పూర్తి చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం విడుదలైన దగ్గరనుండి ఎన్ని రికార్డులను తిరగరాసిందో మరిన్ని కొత్తవి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ చిత్రం 100 కోట్ల షేర్ ను దాటింది. ఓవర్సీస్ లో 3 మిలియన్ ను కూడా దాటింది. మొత్తంగా నాన్ బాహుబలి 2 రికార్డును సైతం కైవసం చేసుకుంది. 50 రోజులు పూర్తవకుండానే ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో దర్శనమిచ్చిన సంగతి తెల్సిందే. రెండు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అల వైకుంఠపురములో స్ట్రీమ్ అవుతోంది.
సాధారణంగా డిజిటల్ రిలీజ్ అయ్యాక ఏ సినిమా అయినా థియేట్రికల్ రన్ తగ్గిపోతుంది. పూర్తిగా డౌన్ అయిపోతుంది. అయితే అల వైకుంఠపురములో విషయంలో మాత్రం అలా జరగట్లేదు. ఈ సినిమా రెండు ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉన్నా సరే ఇంకా థియేటర్లకు ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో ఆడుతున్న అన్ని చిత్రాల్లోకి బెస్ట్ కలెక్షన్స్ ను రాబడుతోంది. గత వారం, ఆ ముందు వారం విడుదలైన చిత్రాల కంటే సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములో ఎక్కువ వసూళ్లు సాధించడం నిజంగా మామూలు ఫీట్ కాదు. జనాలు ఈ చిత్రాన్ని ఎంతలా ఆదరిస్తున్నారో తెలిపే ఘనత ఇది. ట్రేడ్ పండితులు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 150 కోట్ల షేర్ మార్క్ ను దాటుతుందని అంచనా వేస్తున్నారు. అంటే దాదాపుగా 80 శాతం లాభాలు బయ్యర్లు అందుకున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయిక కాగా ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మెయిన్ ప్లస్ పాయింట్ గా నిలిచింది.